On 14 January 2022 Anandhayya visits Peetham Ashram

On 14 January 2022 Anandhayya visits Peetham Ashram

శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమం లో ధ్యాన మందిరం లో ధ్యానం చేసిన శ్రీ అనందయ్య గారు, సంతోషాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. 14 జనవరి 2022 భోగి పండుగ పుణ్య కాలం లో సాయంకాలము కోవిద్ కొరకు ఆయుర్వేదం మందులు ఇస్తున్న శ్రీ అనందయ్య గారు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమం ధ్యాన మందిరం మరియు గోశాల దర్శించారు.
పీఠాధిపతుల విశిష్ఠత ను గ్రహించి, సభ జరిగే సమయంలో మరొక్క సారి వచ్చి పీఠాధిపతుల ను దర్శించుకుంటాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతుల సోదరులు అహ్మద్ ఆలీషా గారు, మహబూబ్ పాషా గారు, పీఠం కమిటీ సభ్యులు శ్రీ ఉమమహేశ్వర రావు గారు, శ్రీ వేంకటేశ్వర రావు గారు, సురేష్ తేజా గారు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
పేరూరి సూరిబాబు,
పీఠం కన్వీనర్

You may also like...