Dr Umar Alisha 141st Jayanthi Sabha Kakinada | 28-Feb-2026

Press note Boat club, Kakinada, 28-2-26


దైనందిన జీవితం లో మానవాళి ఆధ్యాత్మిక ఔషాదం స్వీకరించుట ద్వారా మానవ వికాసం ఏర్పడి, తద్వారా సత్ ఫలితాలు వచ్చి సంసారిక, సామాజిక సమస్యలు పరిష్కారం అగుటయే కాక దేశాభివృద్ధి, విశ్వ శాంతి ఏర్పడునని పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారు అనుగ్రహ భాషణ చేసారు. శనివారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్ వద్ద కవి శేఖర Dr ఉమర్ అలీషా స్వామి వారి 141 వ జయంతి సందర్భంగా ప్రస్తుత పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారి అధ్యక్షతన సభ జరిగినది. ఈ సభలో ప్రముఖ కవి బధరీనాధ్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసoగించారు. ఈ సభలో Rtd RTO రామచంద్ర రావు, Rtd MRO గౌరి నాయుడు, Rtd పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పద్మనాభం, షేక్ ఇబ్రహీం, బలరామ కృష్ణ, వీరభద్రం, తురగా సూర్యారావు, హుస్సేన్ షా తదితరులు అతిధులు గా పాల్గొన్నారు.


Dr ఉమర్ అలీషా మాట్లాడుతూ 16 యేండ్ల ప్రాయంలోనే బ్రహ్మ విద్యా విలాసం అనే గ్రంధాన్ని రచించి పిన్న వయస్సులోనే బ్రహ్మ జ్ఞానిగా, తత్వ వేత్తగా నిరూపితం చేసుకున్నారు. నాటి ప్రజలలో జాతీయ స్వాతంత్ర కాంక్షను కాంక్షించారు. స్వాతంత్ర ఉద్యమం లో మహాత్మా గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు.కేంద్ర అసెంబ్లీలో ఆలోచనత్మక, ఆచరణాత్మక ప్రసంగాలు ఇచ్చారు అని అలీషా అన్నారు. కవి బద్రీనాధ్ మాట్లాడుతూ Dr ఉమర్ అలీషా కవిని అంతర్జాతీయ స్థాయి కవిగా, బహు భాషా కోవిధునిగా, పండిత కవిగా సుప్రతిష్టమాయ్యారని అన్నారు. ఈ కార్యక్రమం లో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు,కమిటీ సభ్యులు శ్రీమతి ఎల్లమాంబ, లక్ష్మి, ప్రభావతి, లక్ష్మి కుమారి, మణి తదితరులు పాల్గొన్నారు.


ఇట్లు,
పేరూరి సూరిబాబు,
9848921799.

You may also like...