Ugadi Sabha 2026 (Telugu New Year) | శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది | 19th Mar 2026
Ugadi Sabha 2026 (Telugu New Year) | శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది | 19th Mar 2026
Press note పిఠాపురం ఉగాది మహా సభ 19-3-26
త్రయీ సాధన అనే విశ్వ సాధన ద్వారా మానవత్వమును పరిమళింప చేసుకోమని పీఠాధిపతి Dr Umar Alisha అనుగ్రహ భాషణ చేసారు. గురువారం ఉదయం స్థానిక శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం, పిఠాపురం నూతన ఆశ్రమ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన పరాభవ నామ సంవత్సర ఉగాది తెలుగు నూతన సంవత్సర మహా సభ లో పీఠాదిపతి Dr ఉమర్ అలీషా జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది మహా సభ ను ఆవిష్కరించారు. సభ కు హాజరైన వేలాది మందికి ఉగాది పచ్చడి పంపిణీ చేయారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన మజ్జిగ చలి వేంద్రాన్ని పీఠాధిపతి Dr ఉమర్ అలీషా ప్రారంభించారు. ప్రముఖ గీతావధాని శ్రీ యర్రంశెట్టి ఉమా మహేశ్వర రావు పంచాంగ శ్రవణం చేసి,రాశి ఫలాలను వివరించారు. తాత్విక బాల వికాస్ ద్వారా చిన్నారులు ఉమా చంద్ర శేఖర్, ఉమా శ్రీ రమ్య, యశస్వి నాగ ఉమా ప్రసంగాలు సభికులను అలరింప చేసాయి. తాత్విక యువ వికాస్ ద్వారా కుమారి కట్రెడ్డి అజీ మున్నిషా స్వానుభవం వివరిస్తూ,చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు యొక్క మహిమను సభ కు వివరించారు. గిరిజన సంక్షేమ కార్యక్రమం లో ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలను కట్టా లక్ష్మి, మరియు లంబాడా తెగకు చెందిన గిరిజన మహిళ శ్రీమతి బనావతు బాపనమ్మ సోనీ పాడిన కీర్తన సభికులను అలరింప చేసాయి. కోయ తెగకు చెందిన కుమారి సోదేం మంగమ్మ, శ్రీమతి కాకి వెంకట లక్ష్మి గార్లను స్వామి శాలువాలు కప్పి, మొక్కలు బహూకరించి సత్కరించారు. ప్రముఖ జర్నలిస్ట్ Dr సునీల్ కుమార్ యాండ్ర పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారి సేవలను స్తుతిస్తూ “మానవతా శిఖరం Dr ఉమర్ అలీషా ” అని వ్రాసిన సన్మాన పత్రాన్ని స్వామి వారికి బహూకరించడం జరిగింది. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా, విద్యార్థికి 70 వేల స్కాలర్షిప్, రాజమహేంద్రవరం ఆశ్రమానికి 50 కుర్చీల నిమిత్తం Rs 32,500 చెక్కు ను, నిరుపేద మహిళకు కుట్టు మిషన్, మహిళా ఆర్ధిక సాధికారత కోసం ఇడ్లీ పాత్ర, పక్షులకు ఆహారంగా ధాన్యపు కుచ్చులను పీఠాధిపతి Dr ఉమర్ అలీషా బహూకరించారు.సంగీత విభావరి కార్యక్రమం లో శ్రీమతి ఉమా ముకుంద బృందం పాడిన కీర్తనలు సభికులను ఆనందింప చేసినవి. పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారు మాట్లాడుతూ తల్లి తండ్రులను గౌరవంగా చూసుకుంటూ, సమాజంలో మానవత్వపు విలువలతో నడుచుకుంటూ, గురు తత్వాన్ని ఆచరిస్తూ, సుఖం, సంతోషం, తృప్తి,మనస్సుకు శాంతిని పొందాలని అనుగ్రహ భాషణ చేసారు. సమస్యలు, కష్టాలు అదిగమించాలంటే ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞానం అనే ఔషాదం ద్వారా మనో శక్తి, మనో దైర్యం పెంపొందించుకుని, భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చి దిద్దుకోమని అన్నారు. మురమళ్ళ శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధంతి గారు పీఠాధిపతి Dr ఉమర్ అలీషా స్వామి వారికి శాలువా కప్పి, గజమాల తో సత్కరించి, నూతన సంవత్సర పంచాంగాన్ని బహహూకరించారు. నూతనంగా మహా మంత్రం పొందాలనే ఆసక్తి కలవారు 90 మందికి స్వామి మహా మంత్రం ఉపదేశించారు.ఈ కార్యక్రమం లో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సూరిబాబు,సెంట్రల్ కమిటీ సభ్యులు శ్రీ AVV సత్యనారాయణ, శ్రీ NTV ప్రసాద వర్మ, Dr పింగళి ఆనంద్ కుమార్, శ్రీమతి K. స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు,
పేరూరి సూరిబాబు,
కన్వీనర్,
9848921799.
