Dr Umar Alisha Swamy visit Vijaya Durga Temple in Muramalla, East Godavari District – 17 October 2021

దుర్గా మాత ఆశీస్సులతో విశ్వశాంతి, దేశ సమగ్రత ఏర్పడి, మానవతా విలువలు పరిరక్షింపబడునని పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణం చేశారు. 17-10-21 ఆదివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా మురమళ్ళ గ్రామంలో శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారి ఆహ్వానం మేరకు పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారు విజయ దుర్గా అమ్మ వారి ఆలయాన్ని దర్శించి, ప్రసంగించారు. అమ్మ వారి ఆశీస్సులతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి అవుతుందని అనుగ్రహ భాషణ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బాణాల దుర్గా ప్రసాద్ సిద్ధాంతి గారు, వారి కుటుంబ సభ్యులు పీఠాధిపతి డా. ఉమర్ ఆలీషా స్వామి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ శ్రీ పేరూరి సురిబాబు గారు, శ్రీ సలాది రమేష్ గారు, శ్రీ YNVKS సత్యనారాయణ గారు, శ్రీ రేఖా ప్రకాష్ గారు పాల్గొన్నారు.

You may also like...